![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -341 లో....సీతాకాంత్ వెళ్తుంటే దారిలో కార్ ఆగిపోతుంది. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి ఎలా ఏదైనా లిఫ్ట్ అడుగుదామనుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి కార్ అటుగా వస్తుంది. దాంతో ఆ కార్ అపి లోపల కూర్చుంటాడు సీతాకాంత్. వెనకాల రామలక్ష్మిని చూసి ఆశ్చర్యపోతాడు. స్కూల్ కి వచ్చి నిన్ను చూసే అవకాశం ఈ రోజు లేదని.. నిన్నే ఇలా కన్పించేలా చేసాడు ఆ దేవుడు అని సీతాకాంత్ అంటాడు. ఇప్పుడు సీతా సర్ కి లిఫ్ట్ ఇవ్వకపోతే నేనే రామలక్ష్మిని అని తెలుస్తుందని రామలక్ష్మి లిఫ్ట్ ఇస్తుంది.
వెళ్తు దారిలో అక్కడ టీ తాగి వెళదామా అని సీతాకాంత్ అడుగుతాడు. వద్దని రామలక్ష్మి అంటుంది. వస్తే నువ్వే రామలక్ష్మివి అని బయటపడతావని భయమా అని సీతాకాంత్ అనగా.. అంత లేదని టీ స్టాల్ దగ్గర ఆగి ఇద్దరు టీ తాగుతారు. పక్కన పెద్దావిడ వెళ్తుంటే.. బస్తీ లోని బామ్మ అని సీతాకాంత్ తన దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావని పెద్దావిడ అంటుంది. మీరేం చెసిన నేను బయటపడనని రామలక్ష్మి అనుకుంటుంది.
మరొకవైపు రామ్ కి శ్రీవల్లి భోజనం తినిపిస్తుంది. రామ్ కి వాటర్ ఇవ్వమని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంటే.. వాడేమైన చిన్న పిల్లాడా అంటూ తను కోప్పడుతుంది. దాంతో నిన్ను ఏమైనా వాటర్ అడిగానా అంటూ రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య అలా అన్నారని శ్రీవల్లి అనగానే.. వాడు నా కూతురిని పొట్టన పెట్టుకున్నాడు. నాకు ఆ బాధ ఉంటుంది కానీ సీతా కోసం బయటపడనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు నాన్న నీతో ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య మిస్ నాతో డిఫరెంట్ గా ఉంటుంది. నీలా యాక్టింగ్ చేసినందుకు బాగా చేసావంటూ మెచ్చుకుంది. ఎందుకు అలా చేసింది. నాకు అర్ధం కాలేదని రామ్ అనగానే నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |